మావోయిస్టు మిలీషియా సభ్యులు అరెస్టు

by  |
మావోయిస్టు మిలీషియా సభ్యులు అరెస్టు
X

దిశ, భద్రాచలం : చర్ల పోలీసులు మావోయిస్డు మిలీషియా సభ్యులను అరెస్టు చేశారు. కుర్నపల్లి అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా, అడవిలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులు పోలీసులు గుర్తించారు. ఇదే సమయంలో పోలీసులను చూసి వారు పారిపోయే ప్రయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. వారిని ఛేజ్ చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకోగా.. మరోక మిలీషియా సభ్యుడు పరారీ అయ్యాడు. పట్టుబడ్డ వారిలో ఛత్తీ‌స్‌గఢ్ రాష్ట్ర డోకుపాడుకి చెందిన కొవాసి భీమయ్య, మరొకరు చర్ల మండలం బూరుగుపాడికి చెందిన సోడి దీపక్‌గా పోలీసులు గుర్తించారు.
ఈ ఇద్దరు గత మూడేళ్ళుగా అజ్ఞాత సాయుధ సీపీఐ మావోయిస్టు దళానికి కొరియర్లుగా వ్యవహరిస్తూ, చర్ల ఏరియా మావోయిస్టు కమిటీకి అనుబంధ మిలీషియా సభ్యులుగా కొనసాగుతున్నారని చర్ల సీఐ అశోక్ వెల్లడించారు.‌


Next Story

Most Viewed