చీరకు నిప్పంటుకొని తల్లీకూతురు మృతి

by  |
చీరకు నిప్పంటుకొని తల్లీకూతురు మృతి
X

దిశ, మెదక్: ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకోవడంతో తల్లీకూతుర్లు మృతి చెందిన ఘటన మెదక్ పట్టణంలోని అజంపుర వీధిలో గురువారం చోటు చేసుకుంది. పట్టణ సీఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ మండలం తిమ్మానగర్ గ్రామానికి చెందిన గట్టయ్య.. మక్తభూపతిపూర్‌లో సీఆర్‌పీ‌గా పని చేస్తున్నాడు. అతనికి ఐదేండ్ల క్రితం రేవతి (24)తో పెండ్లి జరిగింది. వీరికి ఆద్య (3) అనే పాప ఉంది. గట్టయ్య తన ఫ్యామిలీతో అజంపురలో నివసిస్తున్నాడు. ఎప్పటిలాగే అతడు విధులకు వెళ్లగా, రేవతి ఇంట్లో వంట పనుల్లో నిమగ్నమైంది. ఆ సమయంలో ప్రమాదవశాత్తు ఆమె చీరకొంగుకు నిప్పంటుకుంది. ఆ వెంటనే కూతురు ఆద్య(3) కు సైతం మంటలు అంటుకున్నాయి. దీంతో ఇద్దరూ కేకలు వేశారు. గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకునేలోపే తల్లీకూతుర్లు మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వెల్లడించారు.


Next Story