డివైడర్‌ను ఢీ కొట్టి అనంతలోకాలకు..!

by  |
డివైడర్‌ను ఢీ కొట్టి అనంతలోకాలకు..!
X

దిశ, వెబ్‌డెస్క్ : నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని బస్ డీపో‌ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కనే ఉన్న డివైడర్‌ను పల్సర్ వాహనం ఢీ కొట్టింది. ఇదే సమయంలో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకుల తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పాన్‌గల్లి ప్రాంతానికి చెందిన ఎండీ ఆస్నాన్అలీ, సయ్యద్ నౌమాన్‌లు ఇద్దరూ బాల్యం నుంచి మిత్రులు. ఎప్పటిలాగానే భోజనం చేసిన తర్వాత బస్టాండ్ ప్రాంతంలో ఉండే తమ మిత్రుడిని కలిసేందుకు మోటార్ సైకిల్‌పై వెళ్లారు. తిరిగి వెళుతూ అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టారు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Next Story

Most Viewed