ఘోరప్రమాదం.. ఒళ్లు గగుర్పొడిచేలా సీసీటీవీ దృశ్యాలు

by  |
ఘోరప్రమాదం.. ఒళ్లు గగుర్పొడిచేలా సీసీటీవీ దృశ్యాలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ సర్కిల్‌ మైలార్‌దేవ్‌పల్లిలోని దుర్గానగర్‌ చౌరస్తాలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు అతివేగంతో కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతదేహాలు దాదాపు 50 మీటర్ల దూరం వరకు ఎగిరపడ్డాయి. సీసీ కెమెరాల్లో నమోదైన ప్రమాద దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. మృతులు ఆరంఘర్‌కు చెందిన ఎండీ సజ్జాద్, మహ్మద్ నిజాముద్దీన్‌గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed