నడిరోడ్డుపై ప్రేమికుల మృతి

by  |
నడిరోడ్డుపై ప్రేమికుల మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: చౌటుప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. అంతేగాకుండా మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటన యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే…

రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలానికి చెందిన శ్రీలత, నాగరాజు అనే ఓ ప్రేమజంట నల్లగొండ జిల్లా చెర్వుగట్టు రామలింగేశ్వర స్వామి ఆలయంలో వివాహం చేసుకోవడానికి హైదరాబాద్ నుంచి నల్లగొండ వైపు బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో చౌటుప్పల్ మండల కేంద్రం వద్దకు రాగానే వెనకాల నుంచి బ్రేకులు ఫెయిల్ అయి అతివేగంగా వచ్చిన ఓ కారు రెండు బైకులను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీలత అక్కడికక్కడే మృతిచెందగా, నాగరాజు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అంతేగాకుండా ఘటనా స్థలంలో ఒక బైక్ పూర్తిగా దగ్ధం అయింది. గమనించిన స్థానికులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకొని, కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

Next Story

Most Viewed