అతి వేగం కారణంగా రెండు కుంటుంబాలకు తీరని లోటు..

by  |
అతి వేగం కారణంగా రెండు కుంటుంబాలకు తీరని లోటు..
X

దిశ, అలంపూర్: రోడ్డుపై అతివేగంగా కారు నడపడం వల్ల రోడ్డుపై ప్రయాణం చేస్తున్న ఇద్దరి ప్రాణాలను బలి కొనడమే కాకుండా రెండు కుటుంబాల జీవన స్థితిగతులను మార్చేసిన సంఘటన చోటు చేసుకుంది. 44వ నెంబరు జాతీయ రహదారిపై అలంపూర్ చౌరస్తా సమీపంలో ఉండవల్లి గ్రామ శివారులో గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. వుండవల్లి మండలంలోని శేరిపల్లి గ్రామంకు చేందిన మద్దిలేటి రెడ్డి, శంకర్‌లు ద్విచక్రవాహనంపై కర్నూలు నుంచి స్వగ్రామమైన శేరిపల్లికి వెళ్లుతుండగా వెనుక నుంచి అతి వేగంగా దూసుకొచ్చిన కారు బైక్ ను బలంగా ఢీకొట్టింది.

దీంతో ఇద్దరు వ్యక్తులకు బలమైన గాయాలవడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఉండవల్లి పోలీసులు మృత దేహలను పోస్టుమార్టం నిమిత్తం అలంపూర్ ఆస్పత్రికి తరలించారు. అతివేగం కారణంగా రెండు కుటుంబాలలో విషాద చాయలు అలుముకున్నాయి.

Next Story

Most Viewed