డివైడర్‌ను ఢీ కొట్టిన కారు.. అంతలోనే ఇద్దరు..!

by  |
road accident
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం రాళ్ల అనంతపురం వద్ద చోటుచేసుకుంది. అదుపు తప్పిన కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story