నిజామాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

by  |
నిజామాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఎదురేదురుగా వస్తున్న ధాన్యం లారీ, కారు ఢీకొని ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన గురువారం ఉదయం బాన్సువాడ -నిజామాబాద్ రహాదారి వర్ని మండలం అఫాండి ఫారం శివారులో జరిగింది. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కాటేపల్లి కి చెందిన ముగ్గురు కారులో నిజామాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం లో కారు నడుపుతున్న మహబూబ్ (22 ), అందులో ప్రయాణిస్తున్న హబీబా (55)లు అక్కడికక్కడే మృతి చెందగా ఫరీదా( 21) తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆమెను108 అంబులెన్సు లో ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story