జపాన్ నుంచి హైదరాబాద్‌కు త్వరలో రెండు కంగారూలు

by  |
జపాన్ నుంచి హైదరాబాద్‌కు త్వరలో రెండు కంగారూలు
X

దిశ, చార్మినార్: నెహ్రూ జూలాజికల్ పార్కులో మరో రెండునెలల్లో రెండు కంగారులు రానున్నాయని జూ పార్కు క్యూరేటర్​వీవీఎల్ సుభద్రా దేవి తెలిపారు. ఆ కంగారుల ఎన్‎క్లోజర్​నిర్మాణ పనులకు అయ్యే ఖర్చును భరించడానికి దుండిగల్‌లోని గ్లాండ్​ఫార్మా షూటికల్ లిమిటెడ్​కంపెనీ ముందుకు రావడం అభినందనీయమన్నారు. కంగారుల ఎన్‌క్లోజర్‌ నిర్మాణ పనుల నిమిత్తం రూ.20 లక్షల చెక్కును గ్లాండ్​ఫార్మా లిమిటెడ్​ కంపెనీ అధికారులు బుధవారం జూ అధికారులకు అందజేశారు.

ఈ సందర్భంగా జూ పార్కు క్యూరేటర్ వీవీఎల్​సుభద్రా దేవి మాట్లాడుతూ.. వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి కార్పొరేటర్​సంస్థలు కూడా ఆసక్తి కనబరచడం సంతోషకరమైన విషయం అన్నారు. జంతు మార్పిడి పథకంలో భాగంగా జపాన్‌లోని ఓఖ్లాహామా జూపార్కు నుంచి నెహ్రూ జూలాజికల్​పార్కుకు రెండు కంగారులు మరో రెండు నెలల్లో రానున్నాయన్నారు. కంగారులు జూకు వచ్చిన తర్వాత.. వచ్చే ఏడాది వాటిని దత్తత తీసుకుంటామని ఫార్మా కంపెనీ ప్రతినిధులు హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఫార్మా షూటికల్ లిమిటెడ్ ప్రతినిధులు రఘురాం, పి.సంపత్, స్వాతితో పాటు జూ డిప్యూటి క్యూరేటర్​నాగమణి తదితరులు పాల్గొన్నారు.



Next Story