మరో ఇద్దరు జర్నలిస్టులను బలి తీసుకున్న కరోనా

by  |
journalists
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎవరినీ వదలని కరోనా.. తాజాగా జర్నలిస్టులపై పంజా విసురుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు జర్నలిస్టులు కరోనా కాటుతో మృత్యువాత పడ్డారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన బుర్ర రమేష్(46) కరోనా వ్యాధి బారిన పడి మంగళవారం మృతి చెందారు. కరీంనగర్ పట్టణానికి చెందిన పడకంటి రమేష్ హైదరాబాద్ గాంధీలో చికిత్స పొందుతూ చనిపోయారు. స్వంతగా పత్రిక నిర్శహిస్తున్న పడకంటి రమేష్ కరోనా సోకిన తరువాత గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఒకే రోజు ఇద్దరు జర్నలిస్టులు మృత్యువాత పడడం స్థానికులను కలిచివేస్తోంది.

Next Story

Most Viewed