బిగ్ బ్రేకింగ్ : ఐఈడీ బ్లాస్ట్.. ఇద్దరు జవాన్లకు గాయాలు

by  |
బిగ్ బ్రేకింగ్ : ఐఈడీ బ్లాస్ట్.. ఇద్దరు జవాన్లకు గాయాలు
X

దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గురువారం ఉదయం మావోయిస్టులు అమర్చిన ఐఈడీ (మందుపాతర) పేలిన ఘటనలో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. హుటాహుటిన వారిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకివెళితే.. సీఆర్‌పీఎఫ్ 170 బెటాలియన్‌కు చెందిన జవాన్లు మెదక్‌ పాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హల్బాపారా అటవీ ప్రాంతంలో కూంబింగగ్ నిర్వహిస్తుండగా ఐఈడీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో బాలకృష్ణ, సానిదదుల్ ఇస్లామ్ అనే ఇద్దరు జవాన్లు గాయాల పాలయ్యారు. ఈ పేలుడు అనంతరం భద్రతా బలగాలు అప్రమత్తమై గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.



Next Story

Most Viewed