మద్యం అనుకుని.. స్పిరిట్ తాగి ఇద్దరు మృతి

by  |

దిశ, నల్లగొండ: మద్యం అనుకుని స్పిరిట్ తాగడంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. భువనగిరి పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఇద్దరు యువకులు బుధవారం మధ్యాహ్నం మద్యం అనుకుని స్పిరిట్ తాగారు. కాసేపటికి తీవ్ర కడుపు నొప్పి రావడంతో వీరిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే, స్పిరిట్ తాగిన విషయాన్ని ఆ యువకుల తల్లిదండ్రులు వైద్యులకు చెప్పలేదు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి వైద్యులు రిఫర్ చేశారు. కాగా, ఉస్మానియా డాక్టర్లకూ అసలు విషయాన్ని ఆలస్యంగా తెలిపారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో యువకులు మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. మృతులు హౌసింగ్ బోర్డు కాలనీకి ఎదుట గల గుడిసెల్లో నివసించే వారిగా గుర్తించారు.

Tags: two guys died, spirit, drink, wine,yadadri dist



Next Story

Most Viewed