- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఏపీ బ్యూరో: ఒక ప్రియుడు కోసం ఇద్దరు కాలేజీ అమ్మాయిలు కొట్టుకున్న సంఘటన విశాఖ జిల్లాలోని అనకాపల్లి పట్టణంలో చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్టాండ్ లో అందరూ చూస్తుండగానే పిడిగుద్దులతో జుట్టు పీక్కొని చితకబాదుకున్నారు. అక్కడ ఉన్న ఇద్దరు అబ్బాయిలు వచ్చి వారిని అడ్డుకున్నారు. కొంతమంది దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్ గా మారింది.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఇద్దరు అమ్మాయిలతో పాటు ప్రియుడిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అనంతరం కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. తల్లిదండ్రులు కష్టపడి పెంచి పోషించి చదివిస్తే కాలేజీలకు వెళ్లి ప్రేమ పాటలు తప్ప చదువుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్నేహితులు, స్థానికులు చూస్తుండగానే ఇద్దరు అమ్మాయిలు కొట్టుకోవడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. మరి ఈ ఇద్దరు విద్యార్థినిలపై కాలేజ్ యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.