చెరువులో మునిగి ఇద్దరు స్నేహితులు మృతి

by  |
Two friends died
X

దిశ, మునుగోడు: ఈత సరదా ఇద్దరు స్నేహితుల ప్రాణాలు తీసింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… హైదరాబాదులోని సైదాబాద్‌కు చెందిన ప్రవీణ్, శ్రీకాంత్, శ్రీరామ్, మాధవ్, రోహన్ ఐదుగురు స్నేహితులు ఆదివారం ఈత కొట్టడానికి లక్కారం చెరువు వద్దకు వచ్చారు. మాధవ్(19) అనే వ్యక్తి ఈత కోసం ముందుగా చెరువులోకి దిగాడు. ఇంతలో మునిపోతూ కేకలు వేశాడు. గమనించిన రోహన్(17) మాధవ్‌ను కాపాడడానికి చెరువులోకి దూకాడు. ఇద్దరూ ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో గమనించిన ముగ్గురు స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే వారు ఇద్దరు మృతి చెందినట్లు గుర్తించి వారి మృతదేహాలను చెరువులో నుండి వెలికి తీశారు. మృతులు మాధవ్ బీటెక్, రోహన్ ఇంటర్మీడియట్ చదువుతున్నట్లు స్నేహితులు వెల్లడించారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు మృతదేహాలను చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ సీఐ ఎన్.శ్రీనివాస్, ఎస్ఐ నవీన్ బాబు వెల్లడించారు.



Next Story

Most Viewed