- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, నారాయణపేట : నారాయణపేట జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని మరికల్ మండలోని ఎలిగండ్ల గ్రామ శివారులో ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు మహిళా కూలీలు మృతి చెందారు. ఈ ప్రమాద ఘటనపై ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొందరు కూలీలు గ్రామ శివారులో పత్తి చేనులో కూలీ పనికి వెళ్లారు. పత్తి విత్తనాలు నాటి సాయంత్రం ట్రాక్టర్లో.. గ్రామానికి వస్తుండగా కోయిల్ సాగర్ కాల్వ దగ్గర ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ఘటనలో ట్రాక్టర్లో ఉన్న వడ్డే జయమ్మ, వడ్డే సత్యమ్మలు అక్కడికక్కడే మృతి చెందారు. ట్రాక్టర్లో ఉన్న మిగతా కూలీలు వడ్డే ఆంజనేయులు, అనసూయ, మహేశ్వరి, ఆబీబ, లలితకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను మరికల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై టాక్టర్ డ్రైవర్ ఆంజనేయులుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాసర్ తెలిపారు.