విద్యుత్‌షాక్‌కు గురై ఇద్దరు రైతులు మృతి

by  |
విద్యుత్‌షాక్‌కు గురై ఇద్దరు రైతులు మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలంలోని ఎల్బీనగర్ లో విషాదం చోటుచేసుకుంది. బుధవారం పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా విద్యుత్ తీగలు తెగి పడటంతో విద్యుత్ షాక్ కు గురై అదే గ్రామానికి చెందిన ప్రసాద్(52), ఉద్దేహాళ్ గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ వలిభాష(40) మృతి చెందారు. ప్రసాద్ పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ కు గురవడంతో అతన్ని రక్షించేందుకు ట్రాక్టర్ డ్రైవర్ వలిభాష వెళ్లగా… ఇద్దరూ మృత్యువాత పడ్డారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు.


Next Story

Most Viewed