ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

by  |
accident
X

దిశ, వెబ్ డెస్క్ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. జిల్లాలోని రెబ్బన మండలం గోలేటి క్రాస్ రోడ్డు వద్ద రెండు లారీలు బలంగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదం లో ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. వేగంగా లారీలు ఢీకొనడంతో లారీల ముందు బాగాలు నుజ్జు నుజ్జయ్యాయి. దీంతో అతికష్టం మీద మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటన పై పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed