- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కారు బోల్తా… అత్త, అల్లుడు మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: అవనిగడ్డ మండలంలోని దేచవరం మిద్దె సమీపంలో కారు బోల్తా పడి ఇరువురు మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అడిగొప్పల గ్రామానికి చెందిన నాలి నాగేశ్వరరావు తన భార్య, పిల్లలు, అత్తతో కలిసి విజయవాడ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో దేచవరం మిద్దె సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కాలువలోకి దూసుకుపోయి బోల్తా పడింది. ఈ ఘటనలో నాలి నాగేశ్వరరావు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: అవనిగడ్డ మండలంలోని దేచవరం మిద్దె సమీపంలో కారు బోల్తా పడి ఇరువురు మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అడిగొప్పల గ్రామానికి చెందిన నాలి నాగేశ్వరరావు తన భార్య, పిల్లలు, అత్తతో కలిసి విజయవాడ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్లారు.
తిరుగు ప్రయాణంలో దేచవరం మిద్దె సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కాలువలోకి దూసుకుపోయి బోల్తా పడింది. ఈ ఘటనలో నాలి నాగేశ్వరరావు (35), అతని అత్త మారెబోయిన మంగమ్మ(53) మృతి చెందారు. వెంటనే దేచవరం గ్రామస్తులు కారులో ఉన్న వారిని బయటికి తీశారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఎస్సై ఉదయ బాబు సకాలంలో స్పందించి క్షతగాత్రులను తన వాహనంలో నరసరావుపేటలోని వైద్యశాలకు తరలించారు.
Next Story






