బెల్లాల్ చెరువులో రెండు శవాలు ప్రత్యక్షం

by  |
Two died bodies
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్‌ జిల్లా బోదన్ పట్టణానికి మంచినీటిని అందించే బెల్లాల్ చెరువులో రెండు శవాలు ప్రత్యక్షం అయ్యాయి. ఈ ఘటన మంగళవారం ఉదయం వెలుగుజూసింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో మృతదేహాలను వెలికి తీశారు. మృతులు బోదన్‌లోని రాకాసిపేట్‌కు చెందిన శివ, నర్సింహులుగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యనా? ఆత్మహత్యనా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలాన్ని బోదన్ ఏసీపీ రామారావు పరిశీలించారు.

Next Story

Most Viewed