ఘోర ప్రమాదం: ట్రాక్టర్ తిరగబడి స్పాట్‌లోనే….

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-02-06 22:12:06  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రంగంపేట మండలం బాలవరంలో ట్రాక్టర్ బోల్తా పడి అక్కడికక్కడే ఇద్దరు దుర్మరణం చెందారు. మరో 10మందికి తీవ్రగాయాలు కాగా వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బిక్కవోలు మండలం అరికరేవుల నుంచి మురారి వెళ్తుండగా మూలమలుపు వద్ద అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 20మంది ఉన్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. [&hellip;]</p>

accident
X

దిశ, వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రంగంపేట మండలం బాలవరంలో ట్రాక్టర్ బోల్తా పడి అక్కడికక్కడే ఇద్దరు దుర్మరణం చెందారు. మరో 10మందికి తీవ్రగాయాలు కాగా వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బిక్కవోలు మండలం అరికరేవుల నుంచి మురారి వెళ్తుండగా మూలమలుపు వద్ద అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 20మంది ఉన్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story