ఏడు రాష్ట్రాలపై ఉపరితల ద్రోణి.. రానున్న రెండు రోజులు వర్షాలు

by  |
ఏడు రాష్ట్రాలపై ఉపరితల ద్రోణి.. రానున్న రెండు రోజులు వర్షాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాలు సహా ఏడు రాష్ట్రాలపై ఉపరితల ద్రోణి వ్యాపించింది. పశ్చిమ, తూర్పు ప్రాంతాల వైపు గాలుల కారణంగా.. ఈ ద్రోణి తమిళనాడు తీరం నుంచి ఒడిశా తీరం వరకు వ్యాపించింది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో ఏపీ, తెలంగాణలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి వర్షాల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమ, దక్షిణ కోస్తా, తెలంగాణలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఈ అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట నాశనమవుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయితో పోలిస్తే 5 డిగ్రీలు పడిపోయాయి.

Next Story

Most Viewed