గులాబీ తోటలోకి ఇద్దరు కార్పొరేటర్లు

by  |
గులాబీ తోటలోకి ఇద్దరు కార్పొరేటర్లు
X

దిశ, నిజామాబాద్: స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల వేళ.. నిజామాబాద్ రాజకీయం వేడెక్కింది. తాజాగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఇద్దరు కార్పొరేటర్లు గులాబీ కండువా కప్పుకున్నారు. గురువారం హైదరాబాద్‌లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే గణేష్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ల ఆధ్వర్యం‌లో 25వ డివిజన్ కార్పొరేటర్, బీజేపీ నేత సిరిగాదా ధర్మపురి, 40వ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ న్యామతాబాద్ శివచరణ్‌లు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి పార్టీలో చేరినట్టు వారు తెలిపారు.


Next Story