చౌటుప్పల్‌లో రెండు కరోనా కేసులు

by  |
చౌటుప్పల్‌లో రెండు కరోనా కేసులు
X

దిశ, మునుగోడు: కరోనా మహమ్మారి చౌటుప్పల్ మండలంలో విలయతాండవం చేస్తుంది. యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని ధర్మోజిగూడెం, తూప్రాన్‌పేట గ్రామాల్లో ఒక్కో కరోనా కేసు నమోదైనట్టు ప్రభుత్వ వైద్యాధికారి శివప్రసాద్ రెడ్డి వెల్లడించారు. వీరంతా ప్రైవేట్ ఆసుపత్రిలో పరీక్షలు చేసుకోగా పాజిటివ్‌గా రిపోర్టులు వచ్చినట్టు తెలిపారు. బాధిత వ్యక్తులతో కాంటాక్ట్‌లో ఉన్న వారిని గుర్తించి హోమ్ క్వారంటైన్ చేసే పనిలో పడ్డారు అధికారులు.

Next Story

Most Viewed