కరోనా కాటు.. ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి

by Batti.Sumithra |   (  Updated:2021-04-22 02:36:43  IST  )

<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్:  జిల్లాలో కరోనాతో ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి చెందారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ లైన్ లో నివాసం ఉంటున్న హెడ్ కానిస్టేబుల్ ఇంద్రసేన్ ఈ నెల 20న కరోనా సోకడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. నిజామాబాద్ ఎఆర్ కానిస్టేబుల్ సద్దాం (38) గురువారం ఉదయం జిల్లా ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతూ మరణించినట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. నిజామాబాద్ జిల్లాలో కరోనా బారినపడిన పోలీసుల సంఖ్య 100 [&hellip;]</p>

కరోనా కాటు.. ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో కరోనాతో ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి చెందారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ లైన్ లో నివాసం ఉంటున్న హెడ్ కానిస్టేబుల్ ఇంద్రసేన్ ఈ నెల 20న కరోనా సోకడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. నిజామాబాద్ ఎఆర్ కానిస్టేబుల్ సద్దాం (38) గురువారం ఉదయం జిల్లా ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతూ మరణించినట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. నిజామాబాద్ జిల్లాలో కరోనా బారినపడిన పోలీసుల సంఖ్య 100 దాటింది. జిల్లాలోని పోలీస్ శాఖలో మరో ఇద్దరు కరోనాతో సీరియస్ గా ఉన్నారు.

Next Story