ఖాకీల ఘనకార్యం : ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఎమ్మెల్సీ కాల్‌‌డేటా..!

by  |
ఖాకీల ఘనకార్యం : ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఎమ్మెల్సీ కాల్‌‌డేటా..!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని కడప జిల్లా ప్రొద్దుటూరులో ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది. అధికార దుర్వినియోగంతో పాటు ప్రజాప్రతినిధి కాల్ డేటాను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించిన కేసులు ఉన్నతాధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. స్థానిక ఎమ్మెల్సీ కాల్ డేటాను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడంతో ఆయన ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ సుబ్బారెడ్డి, కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు. కాగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed