ఇల్లు కూలి 6 నెలల పసికందు.. ఎనిమిదేళ్ల చిన్నారి మృతి

by  |
Died-1
X

దిశ, వెబ్ డెస్క్: భారీ వర్షాల కారణంగా ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన కేరళలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేరళలో సోమవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కేరళలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున కరిపూర్ సమీపంలో ఓ ఇల్లు కూలింది. ఈ ఘటనలో ఆరు నెలల పసికందు మృతిచెందింది. అదేవిధంగా ఎనిమిదేళ్ల వయస్సున్న ఆ పసికందు అక్క కూడా ఈ ఘటనలో మృతి చెందింది. కేరళలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం హెచ్చరికను వాతావరణ శాఖ జారీ చేసింది. మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.


Next Story

Most Viewed