- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: విశాఖ సిటీ అచ్యుతాపురంలో విద్యుత్ షాక్ తో ఇద్దరు బాలురు మృతి చెందారు. వీరిద్దరూ అన్నదమ్ముల పిల్లలు కావడంతో ఒకే కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. శనికారం కురిసిన వర్షానికి మేడమీద ఫ్లెక్సీ పడడంతో, దానిని తొలగిస్తుండగా కరంట్ వైర్లకు ఫ్లెక్సీ తాకింది. దీంతో ఫ్లెక్సీని పట్టుకున్న యశ్వంత్(15), చరణ్(13)లు కరెంట్ షాక్ తగిలి ఒకేసారి కుప్పకూలిపోయారు.
వీరిని అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ కి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందినట్లు సమాచారం. వీరి తల్లిదండ్రులు అచ్యుతాపురంలో స్వీట్ షాప్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఇద్దరి బాలుర మృతితో అన్నదమ్ముల ఇళ్లల్లో విషాదం నెలకొంది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story