శ్రావణి సూసైడ్‌ కేసు.. షాకింగ్ నిజాలు

by  |
శ్రావణి సూసైడ్‌ కేసు.. షాకింగ్ నిజాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన టీవీ సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ కేసులో సాయికృష్ణారెడ్డి, దేవరాజును ఎస్సార్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏ1గా సాయికృష్ణారెడ్డి, ఏ 2గా దేవరాజురెడ్డిని చేర్చారు. ఈ నేపథ్యంలోనే రేపు మెజిస్ట్రేట్ ముందు నిందితులను హాజరుపర్చనున్నారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మాత అశోక్ రెడ్డికి కూడా పోలీసులు నోటీసులు పంపారు. రేపు ఆశోక్ రెడ్డిని కూడా పోలీసులు విచారించనున్నారు.


Next Story