జర్నలిస్టులపై కక్ష పూరిత చర్య : టీడబ్ల్యూజేఎఫ్

by  |
జర్నలిస్టులపై కక్ష పూరిత చర్య : టీడబ్ల్యూజేఎఫ్
X

దిశ, క్రైమ్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారనే కక్ష పూరిత చర్యలో భాగంగానే ముగ్గురు జర్నలిస్టులపై కేసులు బనాయించడాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య సోమవారం ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్యలు విమర్శించారు. ఈ సందర్భంగా వారు సంయుక్తంగా సోమవారం విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌కు కరోనా వచ్చిందనే వార్తను సాకుగా తీసుకుని కేసు నమోదు చేయడాన్ని జర్నలిస్టులపై ప్రభుత్వ వైఖరి అర్థమవుతోందని అన్నారు. ఈ చర్య అధికార పక్షంపై వార్తలు రాసే జర్నిలిస్టులను భయబ్రాంతులకు గురి చేయడమేనని అన్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆదాబ్ హైదరాబాద్ ఎడిటర్ సత్యం, సబ్ ఎడిటర్ శివ, రిపోర్టర్ అనంచిన్ని వెంకటేశ్వరరావుపై నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed