‘ఖుషీ’ తెగువకు నెటిజన్లు ఫిదా!

by  |
‘ఖుషీ’ తెగువకు నెటిజన్లు ఫిదా!
X

దిశ, వెబ్‌డెస్క్ : ‘ఖుషీ’ ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ అమ్మాయి చూపిన తెగువకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సలోరి ప్రయాగ్ రాజ్‌కు చెందిన ఖుషీ కొద్ది రోజుల కిందట తన తండ్రిని కోల్పోయింది. దానికి తోడు తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది. వైద్యం చేయించడానికి డబ్బులు లేవు.

సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఓ వైపు తన చదువును ముందుకు కొనసాగించడానికి.. మరోవైపు తల్లికి వైద్యం చేయించడానికి ప్రయాగ్ రాజ్‌లోని శుక్లా మార్కెట్‌లో సొంతంగా టీ స్టాల్ పెట్టి కుటుంబ భారాన్ని తనపై వేసుకుంది. కెరీర్‌తో పాటు జన్మనిచ్చిన తల్లిని బతికించుకోవడానికి ఖుషీ చేస్తున్న ప్రయత్నాన్ని నెటిజన్లు స్వాగతిస్తూ తెగ రీట్వీట్స్ చేస్తున్నారు.


Next Story

Most Viewed