- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని 5వ టౌన్ పరిధిలో ఓ యువతి ఈ నెల 14న కనిపించకుండాపోయింది. కామారెడ్డికి చెందిన నలుగురు యువకులు యువతిని కిడ్నాప్ చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో యువతి కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తుండగా గురువారం ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో సదరు యువతి ఆచూకీ దొరికినట్లు తెలిసింది.
యువతి అపస్మారక స్థితిలో ఉండి బట్టలు చిరిగిపోయి ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు.. యువతిని సర్కారు ఆసుపత్రికి తరలించి వైద్య సేవలందిస్తున్నారు. అయితే.. యువతి కుటుంబ సభ్యులు మాత్రం నలుగురు యువకులు తమ కూతురిని కిడ్నాప్ చేశారని ఆరోపించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు మాత్రం అలాంటిదేమీ జరుగలేదని చెబుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి నోరు విప్పితే కానీ.. అసలు విషయం బయటకు రాదు. అయితే, ఆసుపత్రి వైద్యులు మాత్రం యువతికి రెస్టు కావాలని, ఇబ్బంది పెట్టవద్దని పోలీసులను కోరినట్లు సమాచారం.
- Tags
- kidnapping case