అపాచీ ఆర్‌టీఆర్ బైక్ ధరలు పెంచిన టీవీఎస్

by  |
అపాచీ ఆర్‌టీఆర్ బైక్ ధరలు పెంచిన టీవీఎస్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ తన అపాచీ బైక్ ధరలను భారీగా పెంచుతున్నట్టు ప్రకటించింది. టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 200 4వీ, అపాచీ ఆర్‌టీఆర్ 160 4వీ ధరలను పెంచుతున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మోడల్ బైకుల ధరలను టీవీఎస్ కంపెనీ పెంచడం ఇది మూడోసారి కావడం గమనార్హం. అపాచీ 160 4వీ వేరియంట్ ధరను రూ. 3 వేలు పెంచగా, ఇందులో డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 1,14,615కు చేరుకుంది. అలాగే, డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 1,11,565గా ఉంది. అలాగే, టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 200 4వీ వేరియంట్ ధరను రూ. 3,750 పెంచింది. ఈ పెంపు వల్ల ఈ వేరియంట్ బైక్ సింగిల్ చానల్ ఏబీఎస్ బ్రేక్ వేరియంట్ రూ. 1.33,065కి చేరుకోగా, డ్యుయెల్ చానల్ ఏబీఎస్ ట్రిమ్ వేరియంట్ రూ. 1,38.115కు పెరిగింది. పెరిగిన ధరలు ఎక్స్‌షోరూమ్‌గా వర్తిస్తాయని, ప్రాంతాలను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయని కంపెనీ పేర్కొంది. కాగా, అపాచీ 160 4వీ బైకును అత్యాధునిక ఫీచర్లతో తీసుకొచ్చామని కంపెనీ తెలిపింది. ఇందులో 5-స్పీడ్ గేర్ బాక్స్, ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, ఏబీఎస్, ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ లాంటి ఆధునిక టెక్నాలజీతో లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ మోటార్‌బైక్ నైట్ బ్లాక్, రేసింగ్ రెడ్, మెటాలిక్ బ్లూ రంగుల్లో లభిస్తుందని కంపెనీ వెల్లడించింది.



Next Story

Most Viewed