ఇరాన్, అమెరికా మధ్య డీల్ కుదిరింది - ట్రంప్ ప్రకటన

by velandi.Saikiran |

ఇరాన్ తో పీస్ డీల్ పూర్తయిందని తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.

ఇరాన్, అమెరికా మధ్య డీల్ కుదిరింది - ట్రంప్ ప్రకటన
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇరాన్ వర్సెస్ అమెరికా మధ్య యుద్ధం దాదాపు ముగిసింది. ఇరాన్ తో పీస్ డీల్ పూర్తయిందని తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. హార్ముజ్ జల సంధి ఎలాంటి టోల్ లేకుండా ఓపెన్ అవుతుందని కూడా క్లారిటీ ఇచ్చారు. ఎవరైనా ఈ జలసంధి నుంచి వెళ్లవచ్చని పేర్కొన్నారు. ఇకపై ఆంక్షలు ఉండబోవని తెలిపారు. యూఎస్ నావిక దిగ్బంధనాన్ని కూడా తొలగిస్తున్నట్లు ప్రకటించారు ట్రంప్. ఇక ఆలస్యం ఎందుకు ? షిప్ ల ఇంజన్లు స్టార్ట్ చేయండి... ఆయిల్ తరలించండి అంటూ ట్రూత్ సోషల్ లో పేర్కొన్నారు. ఈ నెల 19వ తేదీన స్విట్జర్లాండ్ లో శాంతి ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు చేస్తాయని క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ శాంతి ఒప్పందంపై ఇరాన్ మాత్రం ఇంకా స్పందించలేదు.

Next Story