ఐ యామ్ బ్యాక్ అంటున్న బుల్లితెర నటి

by  |
ఐ యామ్ బ్యాక్ అంటున్న బుల్లితెర నటి
X

కరోనా లాక్‌‌డౌన్‌తో సినిమా, సీరియళ్ల షూటింగ్స్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే, సడలింపుల్లో భాగంగా పరిమిత సంఖ్యలో లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్ చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం చెప్పడంతో.. షూటింగ్స్ మళ్లీ ప్రారంభమయ్యాయి. కానీ షూటింగ్స్ పున: ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే.. బుల్లితెర నటుల్లో కొందరికి కరోనా సోకడంతో కలకలం మొదలైంది. ఈ క్రమంలోనే ‘ఆమెకథ’ ఫేమ్ నవ్యసామి.. కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ‘నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. నాతో ఉన్నవాళ్లంతా చెక్ చేయించుకోండి. నేను తిరిగి కోలుకుంటానన్న నమ్మకం నాకుంది’ అంటూ నవ్య మూడు వారాల క్రితం ఓ వీడియోను విడుదల చేసింది. ప్రస్తుతం తను కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తాజాగా మరో వీడియోను విడుదల చేసింది నవ్య.

ఈ వీడియోలో తన క్వారంటైన్ పూర్తయ్యిందని, ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని తెలిపిన నవ్య.. ‘హాయ్ అందరూ ఎలా ఉన్నారు. నేను చాలా బాగున్నాను. ఇంతకు ముందుకంటే కూడా చాలా బెటర్‌గా ఉన్నా. కుటుంబ సభ్యుల ప్రార్థనలతో పాటు అభిమానుల ప్రేమ, సపోర్ట్ వల్లే నేను కోలుకున్నాను. నాలో మానసిక ధైర్యాన్ని పెంపొందించిన అభిమానులందరికీ థ్యాంక్యూ.. థ్యాంక్యూ సో మచ్. బయట పరిస్థితులు అస్సలు బాలేవు. అందరూ జాగ్రత్తగా ఉండాలి. కరోనా వస్తే క్యూర్ అవుతుంది. ఎక్కువ మాత్రలు వేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రివెన్షన్ ఈ జ్ బెటర్ దెన్ క్యూర్ అనే ఈ గోల్డెన్ లైన్ అందరూ పాటించాలి.. స్టే సేఫ్’ అని వివరించారు. ఇక ఈ వీడియోతో పాటు ‘ఐ యామ్ బ్యాక్’ అంటూ ఓ మెసేజ్ కూడా పెట్టింది.

Next Story