హైదరాబాద్ మింట్ కాంపౌండ్‌లో లంచగొండి

by  |
హైదరాబాద్ మింట్ కాంపౌండ్‌లో లంచగొండి
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీఎస్ఎస్పీడీసీఎల్‌‌లో డివిజనల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న గజవాడ మనోహర్ రూ.35 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. హైదరాబాద్ మింట్ కాంపౌండ్‎లోని అతడి కార్యాలయంలోనే గురువారం సాయంత్రం అతడు చిక్కినట్లు ఏసీబీ అధికారులు చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం పరిధిలో బాధితుడు బొల్లారం బాలనరసింహకు చెందిన రియల్ ఎస్టేట్ వెంచర్ లో 5 కిలోవాట్ల విద్యుత్ సరఫరా చేయాలని కోరగా మనోహర్ రూ.35 వేలు లంచం డిమాండ్ చేసినట్లు వారు చెప్పారు. బాధితుడు తమను సంప్రదించడంతో రంగంలోకి దిగి నగదు తీసుకునే సమయంలో రెడ్ హ్యాండెడ్ గా మనోహర్ ను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. అతడిని అరెస్ట్ చేసి ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ఎదుట హాజరు పరుచనున్నట్లు తెలిపారు. అధికారులు లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి తెలపాలని ఏసీబీ అధికారులు సూచించారు

Next Story

Most Viewed