- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్ ఆర్టీసీని లాభాల్లోకి తీసుకెళ్లేందుకు ఎండీ సజ్జనార్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కార్మికుల్లో నూతన ఉత్సాహాన్ని నింపి ప్రయాణికులు బస్సు ఎక్కే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో దసరా సందర్భంగా ప్రత్యేక బస్సులను నడపడంతో సంస్థకు రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. ఈ సందర్భంగా సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకొని ప్రయాణికులకు వెసులుబాటు ఇచ్చారు. వివాహాలకు అద్దెకు తీసుకునే బస్సులకు సెక్యూరిటీ డిపాజిట్ను తొలగించి బుక్ చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సజ్జనార్ పిలుపుతో ప్రైవేటు బస్సులను బుక్ చేసుకునేవారు సైతం ఆర్టీసీ వైపు మొగ్గు చూపారు. దీంతో ఒక్క రోజే 500 బస్సులు బుక్ అయినట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఈ సందర్భంగా బస్సులను బుక్ చేసుకొని ఆర్టీసీకి సహకరించిన వారందరికీ సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు. బస్ బుక్ చేసుకునేందుకు దగ్గరలోని డిపో మేనేజర్ను కలవాలని లేదా 40-30102829 & 040-68153333 కి ఫోన్ చేయాలని కోరారు.