టాడా కేసును ఎదుర్కొన్న ధీరుడు సోలిపేట

by  |
టాడా కేసును ఎదుర్కొన్న ధీరుడు సోలిపేట
X

దిశ, సిద్దిపేట: దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జర్నలిస్టుల హక్కుల పక్షాన నిలబడ్డాడని, అట్లాగే పీడిత ప్రజల వైపు నిలబడ్డారని పేర్కొన్నారు. మొట్ట మొదటి టాడా కేసు ఎదుర్కొన్న ధీరుడు రామలింగారెడ్డి అని కొనియాడారు. కేసీఆర్ నాయకత్వంలో మొక్కవోని దీక్షతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. జర్నలిస్టులకు సోలిపేట రామలింగారెడ్డి ఆప్త బంధువు అని, ప్రజా ఉద్యమాలకు మద్దతుగా నిలిచారని అన్నారు. సోలిపేట రామలింగారెడ్డి మృతికి నివాళులు అర్పిస్తూ.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు అల్లం నారాయణ ప్రగాఢ సానుభూతి తెలిపారు.



Next Story

Most Viewed