పీజీఈసెట్‌లో 86.01% ఉత్తీర్ణత

by  |
పీజీఈసెట్‌లో 86.01% ఉత్తీర్ణత
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్ పీజీఈసెట్ పరీక్షలో 86.01శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. సెప్టెంబర్ 21న 22 పరీక్ష కేంద్రాల్లో 19 సబ్జెక్టులకు పరీక్ష నిర్వహించారు. 22,282 మంది పరీక్షల కోసం రిజిస్త్రేషన్ చేసుకోగా.. 16,807 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో అబ్బాయిలు 7,793 (46.37 %), అమ్మాయిలు 6,663 మంది(39.64 %) పాసయ్యారు. మొత్తం 14,456 మంది (86.01%) ఉత్తీర్ణత సాధించారు.



Next Story

Most Viewed