ఆగస్టు 3న టీఎస్ ఈ సెట్ పరీక్ష

by  |
TS E Set
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీఎస్ ఈ సెట్ పరీక్షను ఆగస్ట్ 03న నిర్వహించనున్నట్లు జేఎన్ టీయూ ప్రకటించింది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు మరో సెషన్‌లో పరీక్ష నిర్వహించనున్నట్టు బుధవారం టీఎస్ ఈసెట్ కన్వీనర్ వెంకట రమణ రెడ్డి తెలిపారు. ఈ నెల 29న మధ్యాహ్నం 1 నుంచి వెబ్‌సైట్ ద్వారా హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని విద్యార్థులకు సూచించారు.

పరీక్షలపై అవగాహన కోసం ప్రత్యేకంగా తరగతులను నిర్వహిస్తున్నామని తెలిపారు. తరగతుల షెడ్యూల్, టైం స్లాట్‌లను వెబ్‌సైట్‌లో తెలియజేస్తామని వివరించారు. వెబ్‌సైట్ లో మాక్ టెస్ట్ కూడా అందుబాటులో ఉందని, ఈ సదుపాయాలను విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్‌లో పొందుపరిచిన నిబంధనలను పాటించాలని తెలిపారు.



Next Story

Most Viewed