ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్‌‌‌లో మార్పు

by  |
EAMCET
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎంసెట్ ర్యాంకులను ప్రకటించిన విద్యాశాఖ.. కౌన్సిలింగ్ నిర్వహించేందుకు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. దీనికి సంబంధించి ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసినట్లు గురువారం ఎంసెట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ముందుగా విద్యాశాఖ నిర్ణయించిన తేదీల ప్రకారం సెప్టెంబర్ 4 నుంచి 13 వరకూ ఉండగా.. దీన్ని సెప్టెంబర్ 11 నుంచి 16వ తేదీకి మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. వెబ్ ఆప్షన్ల ప్రక్రియ అనంతరం ఈ నెల 18 నుంచి ఇంజినీరింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపులు జరగనున్నట్లు ఉత్తుర్వుల్లో పేర్కొంది. వీటి సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో మాత్రం ఎలాంటి మార్పులు జరగలేదని సెప్టెంబర్ 4 నుంచి 11 వరకు యథాతధంగా జరగనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.


Next Story

Most Viewed