ఘోర ప్రమాదం.. నడిరోడ్డుపై ట్రక్కులో మంటలు..

by  |
ఘోర ప్రమాదం.. నడిరోడ్డుపై ట్రక్కులో మంటలు..
X

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర హింగోలిలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. నాందేడ్-అకోలా రహదారిపై వేగంగా వెళ్తున్న ఓ ట్రక్కులో మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్ అప్రమత్తమై లారీని రోడ్డు పక్కన ఆపేశాడు. ట్రక్కు నుంచి వెలువడిన మంటలతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమీపంలో నీరు అందుబాటులో లేకపోవటంతో ట్రక్కులోని సరకులతో పాటు వాహనం కాలి పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో లక్షల రూపాయల నష్టం జరిగిందని డ్రైవర్​ఆవేదన వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed