భారత్ బంద్‌కు టీఆర్ఎస్ మద్దతు

by  |
భారత్ బంద్‌కు టీఆర్ఎస్ మద్దతు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం రైతులకు మేలు చేస్తున్నామంటూ తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ… వారం నుంచి రైతులు ఢిల్లీలో చేస్తున్న ఆందోళనలకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. చాలా రాష్ట్రాల్లో రైతులు… వెనక్కి తగ్గొద్దని మద్దతు పలుకుతున్నారు. అయితే ఈ బిల్లుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గకుండా పట్టుదలతో ఉండటంతో రైతులు డిసెంబర్ 8 దేశవ్యాప్త బంద్‌ పిలుపు ఇచ్చారు. తాజాగా ఈ భారత్ బంద్‌కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ శ్రేణులు ఈ బంద్‌లో ప్రత్యక్ష్యంగా పాల్గొంటారని అన్నారు. రైతులు న్యాయమైన పోరాటం చేస్తున్నారని వెల్లడించారు. కొత్త వ్యవసాయ చట్టాలు కేంద్రం ఉపసంహరించుకునే వరకూ తాము పోరాటం కొనసాగిస్తామని స్పస్టం చేశారు. అంతేగాకుండా ప్రజలు కూడా ఈ బంద్‌ను విజయవంతం చేసి, రైతులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed