గద్వాల టీఆర్‌ఎస్‌లో విషాదం…

by  |
trs Senior leader parumala nagaraju
X

దిశ, గద్వాల : జిల్లాలో టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ పరుమల నాగరాజు సోమవారం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రి‌లో కొవిడ్ చికిత్స పొందుతూ మరణించారు. కరోనాతో తీవ్ర ఇబ్బందులు గురవడంతో మెరుగైన చికిత్స కోసం గద్వాల ప్రభుత్వ ఆసుపత్రి నుండి హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రి కి కుటుంబసభ్యులు తరలించారు. అయితే ఈ రోజు తీవ్ర అస్వస్థతకు గురైన పరుమల నాగరాజు మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కేశవ్ తదిరతులు నాగరాజు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.


Next Story

Most Viewed