ఈటలకు వెన్నుపోటు.. టీఆర్ఎస్ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు

by  |
ఈటలకు వెన్నుపోటు.. టీఆర్ఎస్ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఖరిపై ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత నగేష్ ముదిరాజ్ మండిపడ్డారు. ఉద్యమ కారుడైన ఈటల రాజేందర్‌ను అన్యాయంగా తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారని ఆరోపించారు. ఉద్యమ ప్రస్థానం నుండి వెన్నంటి ఉన్న ఈటలకు బాహుబాలి సినిమాలో వెన్నుపోటు పొడిచారని నగేష్ ముదిరాజ్ మండిపడ్డారు. భూ కబ్జా ఆరోపణలు వస్తే ఆదరాబాదరాగా విచారణ చేపట్టడంతో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. సీఎం తన సామాజిక వర్గాన్ని అభ్యున్నతి చేసేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. బలహీన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఈటల రాజేందర్‌ను కావాలనే అణగదొక్కుతున్నారని, రానున్న రోజుల్లో ప్రజలే కేసీఆర్ నిర్ణయంపై తీర్పు చెప్తారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈటలపై చేపడుతున్న కక్ష్య పూరితమైన చర్యలకు నిరసనగా తాను టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ’దిశ‘ తో చెప్పారు.


Next Story

Most Viewed