- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, దుబ్బాక : సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో టీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది. దుబ్బాక మండలం నగరం సర్పంచ్ స్వరూప శ్రీనివాస్ రెడ్డి, పద్మశాలిగడ్డ సర్పంచ్ సంధ్యా వినోద్, దౌల్తాబాద్ మాజీ ఎంపీపీ మంగమ్మ రామస్వామి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ముత్యాల శ్రీనివాస్లతో పాటు పలువురు బీజేపీలో చేరారు. ఈ మేరకు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వారికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలకు, నాయకులకు విలువ లేదన్నారు.
అందుకే దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేసేందుకే ఈరోజు కాషాయం గూటికి చేరామన్నారు. బీజేపీ పార్టీకోసం నియోజకవర్గంలో కార్యకర్తలా పనిచేసి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే రఘునందన్ రావును ఇంకా ఇరవై సంవత్సరాల వరకు బీజేపీ ఎమ్మెల్యేగా గెలిపించేందుకు కష్టపడి పని చేస్తామన్నారు. నరేంద్ర మోడీ చేపట్టిన పథకాలు చూసి ఆకర్షితులమై ఈ రోజు బీజేపీ పార్టీలో చేరడం జరిగిందని స్పష్టం చేశారు. దుబ్బాక ఎమ్మెల్యేగా రఘునందన్ రావు గెలిచి సంవత్సరం పూర్తైన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథిగా ఈటల రాజేందర్ హాజరై మాట్లాడారు.