- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, కరీంనగర్: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై తప్పుడు ప్రచారం చేసేందుకే టీఆర్ఎస్ పార్టీ కుట్ర పన్నిందని కొత్తపల్లి బీజేపీ నాయకులు కడార్ల రతన్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జవ్వాజి రమేష్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో వారు మీడియాతో మాట్లాడుతూ..కొంతమంది టీఆర్ఎస్ నాయకులు కావాలనే బావుపేటలో రైతుల పేరిట ఆందోళన కార్యక్రమం నిర్వహించారని తెలిపారు.కరోనా కష్టకాలంలో బండి సంజయ్ రాలేదని చెప్తున్న విషయం శుద్ధ అబద్ధమని, ఎంపీగా సంజయ్ సివిల్ ఆస్పత్రికి వెళ్లి డాక్టర్ల సేవలను కొనియాడిన విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. అలాగే నియోజకవర్గంలో పేదలకు భోజనం అందించాలని పిలుపునివ్వడమే కాకుండా, ఆయనే స్వయంగా ఆహారం అందించారన్నారు.లోకసభ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో పాదయాత్ర చేస్తున్న క్రమంలో కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఎంపీ తన కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చిందన్నారు. కేవలం సంజయ్ పై దుష్ప్రచారం చేయాలన్న అక్కసుతోనే టీఆర్ఎస్ నాయకులు ఈ చర్యకు ఒడిగట్టారని విమర్శించారు. మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ కే మంత్రి కాదని, తెలంగాణ రాష్ట్రానికన్న విషయాన్ని ఆ పార్టీ నాయకులు మరిచి పోవద్దన్నారు.