మానవత్వం మరిచిన TRS ఎంపీ, ఎమ్మెల్యే.. ఫైర్ అవుతున్న నెటిజన్లు

by  |
Mp-BB-Patil
X

దిశ, అందోల్ : మానవత్వం మరచిన టీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యే, అధికారుల తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. సంగారెడ్డి జిల్లా జోగిపేట హౌసింగ్‌బోర్డులోని శ్రీ షిర్డి సాయిబాబా దేవాలయంలో గురుపౌర్ణమి సందర్భంగా ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే క్రాంతికిరణ్ పూజలు నిర్వహించారు. అనంతరం మెట్లపై కూర్చొని ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే క్రాంతికిరణ్, మున్సిపల్, ఏఎంసీ చైర్మన్‌లు పులిహోర తిన్నారు. ఈ క్రమంలో వారి ముందే బిక్షాటన చేస్తూ ఓ ముసలవ్వ కూర్చుని ఉంది.

అయితే, 10 నిమిషాలపాటు వారంతా పులిహోర తింటూ కూర్చుండగా.. అవ్వ వాళ్లనే చూస్తూ అలాగే ఉండిపోయింది. కనీసం తినమని కూడా అడుగుతలేరు.. అన్న ఫీలింగ్‌ అవ్వలో కనిపించింది. ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కనీసం అవ్వకు బువ్వ పెట్టొచ్చు కదా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.



Next Story