- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, అందోల్ : మానవత్వం మరచిన టీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యే, అధికారుల తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. సంగారెడ్డి జిల్లా జోగిపేట హౌసింగ్బోర్డులోని శ్రీ షిర్డి సాయిబాబా దేవాలయంలో గురుపౌర్ణమి సందర్భంగా ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే క్రాంతికిరణ్ పూజలు నిర్వహించారు. అనంతరం మెట్లపై కూర్చొని ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే క్రాంతికిరణ్, మున్సిపల్, ఏఎంసీ చైర్మన్లు పులిహోర తిన్నారు. ఈ క్రమంలో వారి ముందే బిక్షాటన చేస్తూ ఓ ముసలవ్వ కూర్చుని ఉంది.
అయితే, 10 నిమిషాలపాటు వారంతా పులిహోర తింటూ కూర్చుండగా.. అవ్వ వాళ్లనే చూస్తూ అలాగే ఉండిపోయింది. కనీసం తినమని కూడా అడుగుతలేరు.. అన్న ఫీలింగ్ అవ్వలో కనిపించింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కనీసం అవ్వకు బువ్వ పెట్టొచ్చు కదా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Next Story