కరోనా పీడ భోగి మంటల్లో కాలిపోవాలి: కవిత

by  |
కరోనా పీడ భోగి మంటల్లో కాలిపోవాలి: కవిత
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి పీడ భోగి మంటల్లో కాలిపోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. బుధవారం హైదరాబాద్ చార్మినార్ వద్ద జాగృతి ఆధ్వర్యంలో జరిగిన భోగి వేడుకల్లో పాల్గొన్న ఆమె.. అనంతరం భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంక్రాంతి ద్వారా అందరికీ శుభం కలగాలని, దేశమంతా సుభిక్షంగా ఉండాలని వ్యాఖ్యానించారు. భోగి వేడుకల్లో పెద్ద సంఖ్యలో జాగృతి కార్యకర్తలు పాల్గొన్నారు.


Next Story

Most Viewed