టీఆర్ఎస్‌ లీడింగ్ అంటున్న ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్..

by  |
టీఆర్ఎస్‌ లీడింగ్ అంటున్న ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్..
X

దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ గెలిచిందని మీడియా అంతా హోరెత్తుతుండగా భారత ఎన్నికల కమిషన్ వెబ్సైట్ మాత్రం అందుకు విరుద్ధంగా టీఆర్ఎస్ లీడింగ్‌లో ఉందని చెబుతోంది. ఇప్పటివరకు దుబ్బాకలో లెక్కించిన ఓట్లలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు 1,118 ఓట్ల లీడింగ్‌లో ఉండగా.. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో మాత్రం టీఆర్ఎస్ పార్టీ లీడింగ్‌లో ఉన్నట్లు చూపుతోంది. ఇప్పటికీ రెండు పార్టీల అభ్యర్థులు ఎవరు విజయం సాధిస్తారో తెలియకున్నా ప్రజెంట్ మాత్రం బీజేపీనే లీడింగ్‌లో ఉంది. మరోవైపు రెండు పోలింగ్‌ కేంద్రాల్లోని 4 ఈవీఎంల్లో 1,669 ఓట్లు లెక్కించాల్సి ఉంది. అయినప్పటికీ సీఈసీ వెబ్‌సైట్లో టీఆర్ఎస్‌ పార్టీనే లీడింగ్‌లో ఉందని చూపుతుండటం రెండు పార్టీల అభ్యర్థులను టెన్షన్‌కు గురి చేస్తోంది.

Next Story

Most Viewed