ఎలక్షన్స్ టైం.. టీఆర్ఎస్ నేతల టాలెంట్ అదుర్స్

by  |
ఎలక్షన్స్ టైం.. టీఆర్ఎస్ నేతల టాలెంట్ అదుర్స్
X

దిశ, షాద్ నగర్ : కొత్తూరు మున్సిపాలిటీ ఎన్నికలలో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నాయకులు పాట్లు పడుతున్నారు. ఓటర్లను ఆకర్షించడానికి ప్రజలతో మమేకం అయ్యేందుకు కృషి చేస్తున్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మున్సిపాలిటీ 10,11,12 వార్డులకు చెందిన టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా రాష్ట్ర ఆబ్కారీ, క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ స్థానిక ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌తో కలిసి ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు.

అందులో భాగంగా ఒక హోటల్ వద్దకు వెళ్లిన మంత్రి, ఎమ్మెల్యే హోటల్ వద్ద పూరీలు వేస్తున్న హోటల్ వ్యక్తి నుంచి పిండిని తీసుకుని వేడివేడి నూనె ఉన్న బాండీలో పూరీలను వేసి తీశారు. అదేవిధంగా కూరగాయల మార్కెట్‌లో కూరగాయలు అమ్మేవారిని స్వయంగా కలిసి ఓట్లను అభ్యర్తించారు. టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

Next Story

Most Viewed